బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తోపాటు ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ నెల 18న నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు.. బావిలో దూకి చావు.. పెట్రోల్ పోసుకుని చావు.. మీ కుటుంబసభ్యులు కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోండి’ అంటూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.



